Friday, November 14, 2025
HomeCRIMEగర్భిణీ మహిళా కు వైద్యం వికటించడంతో మృతి చెందింది

గర్భిణీ మహిళా కు వైద్యం వికటించడంతో మృతి చెందింది

గర్భిణీ మహిళా కు వైద్యం వికటించడంతో మృతి చెందింది. నిజాంబాద్ నగర లో ని కాలూర్ గ్రామానికి చెంది స్రవంతి (35) నాలుగు నెలల గర్భిణి ఓ కీర్తి సాయి ఆసుపత్రి లో మృతి చెందడం తో బంధువులు ఆందోళనకు దిగారు. చేజారుతుండడమతొ అప్రమత్తం అయిన ఆసుపత్రి యాజమాన్యం బాధితులకు పదిలక్షల పరిహారం ఇవ్వడానికి సిద్ధం అయింది ఆదివారం ఉదయం నగరం లోని ఖలీల్వాడిలో కీర్తి సాయి ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.

నాలుగు నెలల గర్భిణిగా ఉన్న స్రవంతి రొటీన్ చెకప్ లో భాగంగా ఖలీల్ వాడి లోని ప్రముఖ మహిళా డాక్టర్‌ ప్రేమలత ను సంప్రదించింది. గర్భంలో ఉన్న పాప పరిస్థితి బాగాలేదని , శ్వాసకు సంబంధించిన సమస్యతో ఉందని వెంటనే అబార్షన్ చేయాలని లేకుంటే ప్రమాదం ఉందని .చెప్పి అందుకు సంబంధించిన మందులు ఇచ్చి పంపేశారు.దీంతో మందులు తీసుకొని తాము ఇంటికి వెళ్ళామని మృతురాలు బంధువులు చెపుతున్నారు . మందులు వేసుకున్న అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో ఆందోళనకు గురై శనివారం రాత్రే సదురు వైద్యుని సంప్రదించారు.

పొద్దున్నే తేవాలని చెప్పడంతో ఆదివారం ఉదయం గర్భిణీని తీసుకొని ఆసుపత్రికి తీసుకొచ్చారు కానీ … అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీనితో ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశారు. మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. దీంతో హుటాహుటిన ఆమె ను మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందనిఅక్కడి ఆస్పత్రి వైద్యులు తెలపడంతో గర్భిణీ కుటింబీకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది .

గర్భిణీ శవంతో ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన కు దిగారు . గర్భిణీ కి వైద్యం అందించడంలో సదరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యమే నిర్లక్ష్యం చేసిందని వారు మండిపడ్డారు. చివరికి పోలీసులు వచ్చి ఆందోళన కారులను సముదాయించారు.చివరికి యాజమాన్యం దిగివచ్చి బాధితులతో రాజీ చేసుకుంది. పది లక్షల ఆర్థిక పరిహారం ఇవ్వడానికి ముందుకొచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!