నిజామాబాద్లోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న ఎస్ఐ సునీల్ సిబ్బందితో కలిసి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం తరలించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
