దక్షిణ భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ, మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ స్లీప్ స్పెషలిస్ట్ బ్రాండ్ సెంచరీ మ్యాట్రెస్సెస్ అండ్ సోఫాస్ నిజామాబాద్లోని వినాయక నగర్లో తన కొత్త ఎక్స్పీరియన్స్ స్టోర్ను ఘనంగా ప్రారంభించింది.
తెలంగాణ వ్యాప్తంగా తన రిటైల్ నెట్వర్క్ను వేగంగా విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ స్టోర్ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త స్టోర్ ద్వారా నిజామాబాద్లోని వినియోగదారులకు అత్యాధునికమైన నిద్ర మరియు సౌకర్యవంతమైన సోఫా పరిష్కారాలు మరింత చేరువయ్యాయి.
గ్రాండ్ లాంచ్ వేడుకల్లో భాగంగా, ఈ ప్రారంభోత్సవ సమయంలో వినియోగదారులు మ్యాట్రెస్ కొనుగోలుపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. వీటితో పాటు అర్హత కలిగిన కొనుగోళ్లపై పిల్లోస్, బెడ్ షీట్లు, మ్యాట్రెస్ ప్రొటెక్టర్లను ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా, ఎంచుకున్న యాక్సెసరీలపై బై 1 గెట్ 1 ఆఫర్ అందుబాటులో ఉంది.
దీనివల్ల వినియోగదారులు తమ బెడ్రూమ్ సౌకర్యాలను మరింత సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. దీనికి అదనంగా, మ్యాట్రెస్ కొనుగోలు చేసే వారికి సోఫాలపై 40 శాతం వరకు భారీ తగ్గింపు లభిస్తుంది.
తద్వారా తమ బెడ్రూమ్, లివింగ్ రూమ్ రెండింటినీ ఒకేసారి సరికొత్త సౌకర్యాలతో ఆధునీకరించుకునే అవకాశం కలుగుతుంది.ఈ స్టోర్ ద్వారా బజాజ్ ఫిన్ సర్వ్ (Bajaj Finserv) ద్వారా సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు.
కొన్ని ఎంపిక చేసిన ఆర్డర్లపై వేగవంతమైన, ఉచిత డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ప్రారంభంలో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ఈ అవుట్లెట్లో విశాలమైన పార్కింగ్ సదుపాయం, కస్టమర్లకు ప్రాధాన్యతనిచ్చే ప్రత్యేక రిటైల్ లేఅవుట్ ఏర్పాటు చేశారు.
బిల్డింగ్ నంబర్ 1-13-4052, రుక్మిణి ఛాంబర్స్ పక్కన, వినాయక్ నగర్, హైదరాబాద్ రోడ్డులో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కొత్త ఎక్స్పీరియన్స్ స్టోర్ వినియోగదారులకు ప్రత్యక్షంగా, లోతైన షాపింగ్ అనుభూతిని అందించేలా రూపొందించారు.
ఈ అవుట్లెట్లో వివిధ రకాల మ్యాట్రెస్సెస్, సోఫాలు మరియు స్లీప్ యాక్సెసరీలను ప్రదర్శిస్తున్నారు. ఇవి విభిన్నమైన సౌకర్యాలు, ఆరోగ్యం, జీవనశైలి అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి.ఈ స్టోర్ను సెంచరీ మ్యాట్రెస్సెస్ అండ్ సోఫాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ, స్థానిక భాగస్వాములు, వినియోగదారులు, పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం స్లీప్ సొల్యూషన్స్కు ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ, ఈ ప్రారంభోత్సవానికి స్థానికుల నుండి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా ఉత్తమ్ మలానీ మాట్లాడుతూ.. “నిరంతర ఆవిష్కరణలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన డిజైన్ల ద్వారా సౌకర్యాన్ని సరికొత్తగా నిర్వచించడానికి మేం కట్టుబడి ఉన్నాం. నిజామాబాద్లో మా ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించడం తెలంగాణలో మా ఉనికిని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు.
వినియోగదారులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం సరైన నిద్ర పరిష్కారాలను ఎంచుకునేలా, వారికి పర్సనలైజ్డ్, అవగాహనతో కూడిన కొనుగోలు అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కొత్త ఎక్స్పీరియన్స్ స్టోర్ ఆర్థోపెడిక్ మ్యాట్రెస్సెస్, మెమరీ ఫోమ్ సొల్యూషన్స్, అడ్వాన్స్డ్ స్ప్రింగ్ సిస్టమ్స్, ఎర్గోనామిక్ సోఫాలతో కూడిన విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తోంది. ఈ ఉత్పత్తులు హై-డెన్సిటీ ఫోమ్ టెక్నాలజీ, కూలింగ్ కంఫర్ట్ లేయర్స్, యాంటీ మైక్రోబియల్ ప్రొటెక్షన్ సొల్యూషన్స్తో తయారు చేశారు.
ఇవి మన్నిక, పరిశుభ్రత, మెరుగైన నిద్ర నాణ్యతను నిర్ధారిస్తాయి.సౌకర్యవంతమైన పరిష్కారాల కోసం ఒకే చోట అన్ని లభించేలా (వన్-స్టాప్ డెస్టినేషన్) రూపొందించిన ఈ స్టోర్, వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందు ఉత్పత్తులను స్వయంగా అనుభూతి చెందే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఇక్కడ ఉన్న శిక్షణ పొందిన స్లీప్ అడ్వైజర్లు వినియోగదారుల వ్యక్తిగత సౌకర్యం, ఆరోగ్య అవసరాల ఆధారంగా సరైన వాటిని ఎంచుకోవడంలో మార్గనిర్దేశం చేస్తారు.భారత్ అంతటా 4 వేల 500 కంటే ఎక్కువ డీలర్ అవుట్లెట్లు, 450కి పైగా ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్ల బలమైన నెట్వర్క్తో, సెంచరీ తన రిటైల్ ఉనికిని విస్తరిస్తూనే ఉంది. వినియోగదారులు మెరుగైన నిద్రను, మెరుగుపర్చిన జీవనశైలి సౌకర్యాన్ని పొందేలా చేయాలనే తన ప్రధాన లక్ష్యానికి కట్టుబడి ఈ విస్తరణను కొనసాగిస్తోంది.
