హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. ఇవాళ నాంపల్లిలోని సైబర్ క్రైమ్ బ్యూరో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ రెయిడ్లో ఓ బాధితుడి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా సైబర్ క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) మహేందర్ ఏసీబీ వలకు చిక్కారు.
కార్యాలయంలోనే సీఐ మహేందర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాంపల్లి సైబర్ క్రైమ్ కార్యాలయంలోనే సోదాలు కొనసాగుతున్నాయి.
