నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్ ను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ సాదరంగా స్వాగతం పలికారు.
నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ ను పలువురు శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి పరిచయం చేసుకున్నారు.
కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
