కమిషనరేట్ పరిధి లో మరో కానిస్టేబుల్ మీద వేటు వేస్తూ కమిషనర్ ఉత్తర్వ్యూలు జారీచేశారు.రుద్రూర్ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వహిస్తున్న సిద్దిరామ్ చిన్నయ్య రావుల నాగభూషణం అనే వ్యక్తికి ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తాను అని గత కొన్ని నెలల క్రితం 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు .
అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం ఇప్పించలేదు. డబ్బులు అతనికి ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదు. బాధితుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో లో పిర్యాదు చేసాడు నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాలల్లో కూడా ఉద్యోగాల పేర లక్షలకొద్దీ డబ్బులు వసూలు చేసి వారందరినీ మోసానికి గురిచేసినట్లు విచారణ లో తేలింది .
ఈ రకంగా అక్రమంగా సంపాదించిన డబ్బును ఇతను ఇతరులకు వడ్డీ రూపంలో డబ్బులు ఇచ్చాడు 10 శాతం కన్నా ఎక్కువ వడ్డీని వసూలుచేస్తున్నాడు , విచారణ లో తేలింది దీనితో ఇతని బాధితులందరిని వివరంగా విచారించిన తర్వాత అందరి విజ్ఞాప్తులు కమీషనర్ పి.సాయి చైతన్య, దృష్టికి వెళ్ళింది . క్రమశిక్షణ చర్యలలో భాగంగాకానిస్టేబుల్ ను “నస్పెండ్ చేస్తు ఉత్తర్వులు” జారీచేశారు.
ఇటువంటి చర్యలను సహించేదిలేదని మరియు ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా వుండి మోసపోకూడదని పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, హెచ్చరించారు.
