సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్ నేరాలను అరికట్టాలని , మహిళలు , చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని బాసర జోన్ డిఐజి భాస్కరన్ ఆదేశించారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా , విక్రయాలు , వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
ఆయన శనివారం నిజామాబాదు పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ యందు సమీక్షా సమావేశం నిర్వహించారు నిర్మల్ , ఆదిలాబాద్ , జగిత్యాల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం అయ్యారు ప్రజలకు అందుబాటులో ఉండే స్నేహపూర్వక పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని , ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని డీఐజీ పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండాలని , ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు , సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల పోలీసు అధికారులు , యూనిట్ ఇన్చార్జ్లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని తమ జిల్లాలకు సంబంధించిన పనితీరు , నేర నియంత్రణ చర్యలు , ఎదురవుతున్న సమస్యలు మరియు చేపట్టాల్సిన కార్యాచరణపై డీఐజీ కి వివరించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీమతి డాక్టర్ జి. జానకి షర్మిల,., ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్,జగిత్యాల్ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, మరియు అదనపు ఎస్పీలు , ఏసీపీలు , సిఐలు , రిజర్వ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు
