రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ దుర్ఘటన లో 22 మంది అక్కడికక్కడే మృతిచెందారు , తీవ్ర గాయాలపాలైన పలువురు ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు
బస్సుమీద కంకర లోడు ఉన్న టిప్పర్ పడడం వల్లే ప్రాణ నష్టం జరిగింది
ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో కూడా అపశృతి చోటుచేసుకుంది.
చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జేసీబీ ఎక్కింది. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను కూడా చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
