నగరంలోని అర్సపల్లి శివారులోని భగత్సింగ్ కాలనీలో దీపం అంటుకుని ఇల్లు దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలోని చంద్రగిరి అశోక్ ఉదయాన్నే పని నిమిత్తం బయటకు వెళ్లారు. అయితే ఇంట్లో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు ఇతర వస్తువులకు అంటుకుని ఇల్లంతా కాలిపోయింది.
రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఫైర్జేషన్ ఇన్ఛార్జి ఫైర్ ఆఫీసర్ నర్సింగ్రావు, ఫైర్మన్ ఏసురత్నం, రవి, సతీశ్, బస్వరాజ్, సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
