బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై రెండవ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యాసిర్ ఆర్ఫాత్ తెలిపారు.
నగరంలోని హైమద్ పుర కాలనీకి చెందిన ఓ పదేళ్ల బాలిక శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కిరాణా షాపుకు వెళ్లి వస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన భాషిత్ (50) అనే వ్యక్తి.
ఆ బాలిక తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక హుటాహుటిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తో విషయం తెలిపింది. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు రెండవ టౌన్ ఎస్సై యాసిర్ ఆర్ఫాత్ పేర్కొన్నారు.
