ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ…ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ను ధరించాలని ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ పేర్కొన్నారు.
ఆదివారం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ దరించడంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకపోవడంతో అనేకమంది ద్విచక్రవాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు హెల్మెట్ లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.
ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలని అన్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.