పోలీసులమని మాయమాటలు చెప్పి నగలు దోచుకెళ్లిన ఘటన డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇందల్వాయికి చెందిన ఇథియా నాయక్, తన మనవడీతో కలిసి మాధవ్ నగర్ బైపాస్ నుంచి NZBకి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి పోలీసులమని చెప్పి బంగారు చైను, ఒక ఉంగరం తీసుకున్నారు.
వాటికి బదులుగా నకిలీవి ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు.
