తెలంగాణ లో అధికారం లోకి రావడం ఖాయమని బీరాలు పలుకుతున్న కమలనాధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం లో జరుగుతున్నా జాప్యం ఫై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీనియార్టీ ఆర్థిక సామజిక సమీకరణలతో ఢిల్లీ పెద్దలు ఇంకా ఎడతెగని కసరత్తులు చేస్తూనే ఉన్నారు. ఎటూ తేల్చలేక తలలలు పట్టుకుంటున్నారు. కొత్త సారథి కోసం పార్టీ పెద్దలు సాగిస్తున్న చర్చలు ఓ ప్రహసనంగా మారాయి. క్యాడర్ లో నూ అసహనం వ్యక్తం అవుతుంది.
నియామకం కఠినంగా వ్యవహరించాల్సిన ఢిల్లీ పెద్దలు మెతక వైఖరి తో పదే పదే చర్చ పేరుతొ కాలయాపన చేస్తుండడం ఫై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రజాక్షేత్రంలో పార్టీ కార్యకలాపాలు కనుమరుగు అయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది మరోవైపు వరంగల్ సభ తో బిఆర్ యస్ లో జోష్ కనిపిస్తుంది.
అధికారం కలలు కంటున్న కమలం పార్టీ ఇంకా సంస్థాగత వైఫల్యాలతో కుస్తీ పడుతుంది. ప్రజల్లో మరోసారి పార్టీ మారు మోగేలా చేయగలిగే నేతకు పగ్గాలు అప్పగించే విషయంలో అదిష్టానం వ్యూహాత్మకంగానే మీనమేషాలు లెక్కిస్తుంది.అనేక మంది పేర్లతో ఎడతెగని కసరత్తులు విస్తృతమైన సంప్రదింపులు జరుపుతుంది.
ఆవసరమైతే క్యాబినెట్ ప్రక్షాళన చేస్తామనే సంకేతాలు ఇస్తున్న అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడి ని ఖరారు చేయడంలో ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. పార్టీలో కొత్తగా చేరిన వారికి అధ్యక్ష పదవి కట్టబెట్టే విషయంలో వెనుకాడుతున్నది.
కానీ సీనియర్ నేతల్లో దూకుడు గా వెళ్లే తత్త్వం బండి సంజయ్ ఒక్కరికే ఉంది కానీ ఆయన ఇదివరకే ఆ బాధ్యతల్లో పని చేసి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనకె మరో సారి సారథ్య బాధ్యతలు అప్పగించే ఆలోచన చేసినా అందుకు బండి ససేమిరా అన్నారు.
అందుకే ఎంపీ లో ఒకరికి అవకాశం ఇచ్చే ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే బిసి సామజిక వర్గం నుంచే ఒకరికి పగ్గాలుఅప్పగించే ఆలోచన జరుగుతుంది. అనుభవం సామజిక వర్గం పరంగా ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నా ఆయన మెతక వైఖరి తో ఉంటారనే వెనుకాడుతున్నారు.
రేవంత్ కెసిఆర్ లాంటి దిగ్గజ నేతల ను ఎదుర్కోవాలంటే దూకుడు గా వెళ్లే వారైతేనే పార్టీ కి మునుపటి క్రేజ్ వస్తుందని అధిష్టానం ఆశాభావం తో ఉంది. ఇందులో భాగంగానే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేరు సైతం తుది పరిశీలనకు వచ్చింది. ఆయన విషయంలో ఈసారి సంఘ్ నేతలు సైతం గట్టిగా పట్టుబడుతున్నారు.
పార్టీ పగ్గాలు కొత్తవారికి ఇవ్వడం అనివార్యం అయితే అర్వింద్ బెటర్ అంటూ ఆ నేతలు స్పష్టంగా పేర్కొన్నారు. పార్టీ పెద్దలు ఈటెల కు సానుకూలంగా ఉన్నా సంఘ్ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు అందుకే కొత్త సారథి నియామకం పక్రియ అధిష్టానం క్లిష్టంగా మారింది