దేశవ్యాప్తంగా బుధవారం 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
నగరంలోని 4 ప్రధాన ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి . సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ DRDA, మౌలాలి NFC లో ఈ మాక్ డ్రిల్ జరగనుందని అధికారులు ప్రకటించారు.
జంగ్ సైరన్ ఎలా వుంటుంది …..
పహాల్గమ్ ఘటన తో పాకిస్తాన్ తో యుద్ధం అనివార్యంగా భావిస్తున్న భారత ప్రభుత్వం దేశ పౌరలును అప్రమత్తం చేస్తూ బుధవారం మాక్ డ్రిల్ కు సిద్ధం అవుతుంది యుద్ధ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సెక్యూరిటీ డ్రిల్ జరుగుతోంది.
దేశంలో ఎలాంటి మాక్ డ్రిల్ ఇప్పటిదాకా మూడు సార్లు నిర్వహించారు. 1971 లో 62 65 యుద్ధాల్లో ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధం తలెత్తినప్పుడు పౌరులు ఎలా ఉండాలో ఆర్మీ ఈ మాక్ డ్రిల్ చేస్తుంది.
సెక్యూరిటీ డ్రిల్ సందర్భంగా ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. ఈ సైరన్ వినపడగానే వైమానిక దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రదేశాలకి వెళ్లిపోవాలి.సెక్యూరిటీ డ్రిల్లో భాగంగా హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.
ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం, లాజిస్టిక్స్ ఇష్యూస్ను గుర్తిస్తారు. నిజంగా యుద్దం జరిగినపుడు .. సమస్యలను అధిగమించే విధంగా చర్యలు ఉంటాయి.
పౌరులకు శిక్షణ
పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో యుద్దం గురించి శిక్షణ ఇవ్వనున్నారు. యుద్ధ సమయంలో సురక్షిత ప్రాంతాలను ఎలా గుర్తించాలి. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి. ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఎలా ఉండాలనే అంశాలపై శిక్షణ ఇస్తారు.
ఇందులో భాగంగా తాత్కాలికంగా మొబైల్ సిగ్నల్స్ నిలిపివేస్తామని తెలిపింది.ట్రాఫిక్ డైవర్షన్స్, కీలక ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మాక్ డ్రిల్లో భాగమేనని పేర్కొంది.
పబ్లిక్ అనౌన్స్మెంట్, తాత్కాలికంగా రాత్రిపూట కరెంటు నిలిపివేయడం, యుద్ధం సంభవించే పరిస్థితుల్లో ఎలాంటి ఎమర్జెన్సీని పాటిస్తారో అలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించింది.