Saturday, May 24, 2025
HomeCRIMEషూ ....గప్ చుప్ .....కేసులతో వణుకు ......బెంబేలేత్తిస్తున్న నగర పోలీసులు ....రాత్రి 10 న్నర...

షూ ….గప్ చుప్ …..కేసులతో వణుకు ……బెంబేలేత్తిస్తున్న నగర పోలీసులు ….రాత్రి 10 న్నర కే మూత పడుతున్న వ్యాపారాలు …….ఫలిస్తున్న కొత్వాల్ కఠిన చర్యలు ……..గంట పెంచాలంటూ పెరుగుతున్న ఒత్తిడి ….

ఇప్పటిదాకా ఓ లెక్క……ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ విరుచుక పడుతున్నారు నగర పోలీసులు నిర్దేశిత గడువులోగా దుకాణాలు మూసేయాలంటూ సైరన్ లతో బెంబేలెతిస్తున్నారు. మాట మాట్లాడకుండా దుకాణాలు మూసేస్తున్నారు.

నిజమే రాత్రి పదిన్నర అయిందంటే చాలు పెట్రోలింగ్ వాహనాలు ప్రధాన విధుల్లో హోరెత్తుతున్నాయి. అర గంట లో నగరం నలు వైపులా వ్యాపారాలు ఇట్టే మూత పడుతున్నాయి.

దశాబ్దాల తరబడిగా అర్ద రాత్రి రెండు గంటల దాక దందా ను సాగిస్తూ వచ్చిన వారంతా ఈసారి కిమ్మనకుండా దుకాణాలు క్లోజ్ చేస్తుండడం తో చూసే వారు ఔరా అంటూ విస్తు బోతున్నారు.

కొత్త పోలీసు కమిషనర్ వచ్చిన మొదట్లో రాత్రి పదకొండు గంటలకు నగరంలో తిరిగారు ఎక్కడ చూసిన జాతరను తలపించేలా జన సందడి వుండడంతో విస్తు బోయారు అసలే హైదారాబాద్ లో ఎక్కువగా కాలం పనిచేసిన అయన అర్ద దాక వ్యాపారాలు సాగడంఫై ఆక్షేపించారు.

రాత్రి పదిన్నరకే ఎలాంటి దుకాణాలైన మూసేయాల్సిందే అంటూ హుకంరించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు నిర్దేశించారు. అప్పటి నుంచి ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు.

గతంలో పోలీసు బాస్ లు సైతం ఇదే తరహా పోలీసింగ్ కు సిద్ధం అయ్యారు కానీ అధికార పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు పదే పదే రావడంతో అనేక మంది బాస్ లు వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో ఈసారి అదే తంతు ఉండబోతుందని బడా వ్యాపారాలు లైట్ తీసుకున్నారు షాప్ లు క్లోజ్ చేయడానికి నిరాకరించారు.

కానీ కేసులతో పోలీసులు బెంబేలెత్తించారు. నిర్ణిత సమయానికి కూడా దుకాణాలు మూసేయని యజమానుల మీద కేసు లు నమోదు చేయడం ఉదయం కోర్టు కు పంపడం అక్కడి జరిమానా లేదంటే ఏకంగా జైలు శిక్ష వేస్తుండడంతో వ్యాపారాలు దెబ్బ కు దారి లోకి వచ్చారు.

దాదాపు నెలరోజుల్లోనే ముప్పై కి పాగా ఈ తరహా కేసులు నమోదు అయ్యాయి. అర్ద రాత్రి దాటాక రోడ్ల మీద జనం యథేచ్ఛగా తిరగకుండ ఆరు బయట గప్పాలు కొట్టకుండా ఆపరేషన్ చబుత్రా మొదలు పెట్టారు.

రాత్రి పదిన్నర కే దుకాణాలు మూసేయాల్సి వస్తుండడంతో హోటల్స్ పాన్ షాప్ నిర్వాహుకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అధికార పార్టీ నేతల ను ఆశ్రయించారు కనీసం పదకొండు గంటల దాక అయినా గడువు ఇవ్వాలని కమిషనర్ మీద ఒత్తిడి చేయించే వ్యూహ రచన చేసారు.

ఒకరిద్దరు బడా నేతలు సైతం సీపీ కి సైతం నచ్చజెప్పే యత్నం చేసినా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. చివరికి యంఐయం నేతలను ఆశ్రయించారు.

వారు నేరుగా వెళ్లి సీపీ కి వినతి పత్రం కూడా ఇచ్చారు.వారికి కూడా ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు.నిజానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారాలు ఈసారి దారి లోకి వచ్చారు పదిన్నరకే దుకాణాలు మూసేసి వెళ్తున్నారు పెట్రలోలింగ్ వాహనాలు పదే పడే సైరన్ లతో హడావుడి చేస్తున్నారు.

గతంలో మొండికేసిన బడా హోటల్స్ యజమానులు సైతం దందా లు గడువులో గా క్లోజ్ చేస్తున్నారు. అర్సపల్లి సమీపంలో ఓ హోటల్ యజమాని ముందు భాగం మూసేసి అర్ద రాత్రి దాక వెనుక డోర్ నుంచి దందా సాగిస్తున్నారు ఇలాంటి ఒకరిద్దరు మినహా మొత్తంగా నగరంలో దుకాణాలు నిర్ణిత సమయానికే మూత పడుతున్నాయ్ . నగర పోలీసు ల చేసిన కట్టడి చర్యలు ఫలించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!