మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ జూన్ 5 న విచారణకు స్వయంగా రావాలని పేర్కొంది అలాగే మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది.
జూన్ 6న హరీశ్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
నాటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకోవడంతో..
తెలంగాణ ప్రభుత్వం కమిషన్ గడువును 2025 జూలై 31 వరకు పొడిగించింది.ఈ విచారణ నివేదిక సమర్పణ కోసం కాళేశ్వరం కమిషన్ సన్నాహాలు చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు రావడంతో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగిస్తుం
