HomeTelanganaNizamabadనిజామాబాదు జిల్లా వంజరి సంఘం అధ్యక్షుడిగా మాస్టర్ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నిక

నిజామాబాదు జిల్లా వంజరి సంఘం అధ్యక్షుడిగా మాస్టర్ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నిక

ఈ రోజు నిజామాబాదు జిల్లా కేంద్రంలోని మామిడి పల్లి వంజరి సంఘం కళ్యాణ మండపంలో జిల్లా వంజరి సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యుల ఏకగ్రీవ నిర్ణయం మేరకు ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి సేవలందిస్తున్న మాస్టర్ శంకర్ గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు.

ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు బోనేకర్ భూమయ్య గారి నుంచి మాస్టర్ శంకర్ గారు అధికారికంగా బాధ్యతలు (చార్జ్) స్వీకరించారు. అనంతరం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రధాన కార్యదర్శి గా ధాత్రిక వేణుగోపాల్ కోశాధికారి గా కరిపే మధుసూదన్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

ఈ సందర్భంగా అధ్యక్షులు మాస్టర్ శంకర్ మాట్లాడుతూ, త్వరలోనే పూర్తి స్థాయి జిల్లా కమిటీని నియమిస్తానని తెలిపారు. జిల్లా సంఘాన్ని అందరినీ ఏకతాటిపై ఉంచి సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంగోనే మల్లేష్, కోశాధికారి నవతే నర్సయ్యతో పాటు జిల్లా మరియు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments