HomeCRIMEఅదృశ్యమైన వృద్ధురాలు...శవమై కనిపించింది..

అదృశ్యమైన వృద్ధురాలు…శవమై కనిపించింది..

నగరంలోని రూరల్ మండలంలోని నాలుగురోజుల క్రితం అదృశ్యమైన వృద్ధురాలు మంగళవారం గుపన్ పల్లీ వాగులో శవమై కనిపించింది.వివరాల్లోకి వెళ్లితే.గుపన్ పల్లీ గ్రామానికి పానుగంటి రజవ్వ(85).

ఈ నెల 11న ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది.దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

ఈ మేరకు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు మిస్సింగ్ నమోదు చేశారు.

మంగళవారం గుపన్ పల్లీ వాగులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పానుగంటి రాజవ్వ గా గుర్తించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వృద్ధురాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments