తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివ రెడ్డి ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గా మొహమ్మద్ రహీముద్దీన్ నియమితులయ్యారు .
ఈయన ప్రస్తుతం మహమ్మద్ రహీముద్దీన్ నిజామాబాద్ మొదటి, మూడవ జ్యూడిషల్ ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్ కోట్ల అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ బిచ్కుంద మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోట్లకు కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈయన పోలీసుల తరఫున ప్రభుత్వం తరపున మరియు బాధితుల తరుపున తన వాదనలను వినిపించనున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గా మొహమ్మద్ రహీమ్ ఉద్దీన్ నియామకాన్ని హర్షిస్తూ నిజామాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిళ్ల సాయి రెడ్డి గారు మరియు కార్యదర్శి మాణిక్ రాజుగారు నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
