కన్నకొడుకు నే కడ తీర్చిన తల్లి పదేళ్ల జైలు శిక్ష విధిస్తు న్యాయ స్థానం తీర్పుఇచ్చింది. నిజాంబాద్ సంతోష్ నగర్ కి చెందినటువంటి గడ్డం భరత్ పెయింటర్ పని చేస్తూ సదాశినగర్ మండలం తిరుమల గ్రామానికి చెందిన లావణ్యతో వివాహమైంది.
వారికి ఇద్దరు సంతానం పెద్దకొడుకు రోహిత్ చిన్న కొడుకు రణదీప్ బ్రతుకుతెరువు కోసం కుటుంబంతో సహా కామారెడ్డి వెళ్లి జీవనం కొనసాగించాడు అయితే ఆయన భార్య లావణ్యకు తాగుడు తిరుగుడు అలవాటు ఉండడంవల్లఆమె నిర్లక్ష్యం వల్లచిన్న కొడుకు 9 నెలల వయసులో అనారోగ్యంతో మరణించాడు అనంతరం తిరిగి నిజామాబాద్ వచ్చేససారు.
మద్యం కు బానిస అయిన లావణ్య పెద్దకొడుకు గడ్డం రోహిత్ ఎలాగైనా చంపాలని పథకం వేసింది రోజు జానకంపేట కెనాల్ లో బాబును పడేయాలని ప్రయత్నించగా జన సంచారం ఎక్కువ గా ఉండడంతో వెనక్కి తగ్గింది కానీ మరుసటి రోజే .
మార్చి 28 న సాయంత్రం బాబును తీసుకొనీ ఇంటి నుంచి వెళ్లిపోయి బోర్గం( కె )సబ్ స్టేషన్ వెనకాల గల నిజాంసాగర్ కెనాల్ లో బాబుని నీటిలో ముంచుతూ గొంతు నలిని చంపేసింది ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి లావణ్య ను అరెస్టు చేశారు.
కేసు విచారణ అనంతరం సెకండ్ అడిషనల్ డిస్టిక్ట్ జడ్జ్ T.శ్రీనివాస్ 10 సంవత్సరాల జైలు శిక్ష వెయ్యి రూపాయల ఫైన్ 5000, పైన కట్టని యెడల ఆధారంగా మరొక నెల జేలు శిక్ష విధించడం జరిగింది.
