ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నిజామాబాద్ వారు వ్యవసాయంలో తమ జీవితం త్యాగం చేసి ఇప్పుడు మనకు పిడికెడు అన్నం అందిస్తున్న భూతకాల రైతులు శ్రీ మల్కాయి లక్ష్మీనారాయణ శ్రీ కొరడి చిన్న నడిపి నరసయ్య మరియు వర్తమాన రైతు శ్రీ సుంకేట్ ప్రవీణ్ గారిని వారు చేసిన సేవలకు గుర్తింపుగా శాలువాతో సత్కరించడమైనది ఇట్టి కార్యక్రమంలో సీనియర్ లయన్ లీడర్ పి. లక్ష్మినారాయణ, బి గురు ప్రసాద్ రీజన్ ఆర్ సి ఓ నాగేశ్వరరావు క్లబ్ అధ్యక్షుడు అబ్బాయి లింబాద్రి ప్రధాన కార్యదర్శి పి రాఘవేంద్రబాబు మరియు ఇతరులు పాల్గొన్నారు.
లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని ఇప్పుడు మనము బ్రతుకుతున్నామంటే రైతులు పండించే గుప్పెడు మెతుకులతో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపినారు.
వారు చేసిన చేస్తున్న సేవలు మరవలేవని ముందు ముందు వారు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని కోరినారు.
