డిజిపి ఆఫీస్ వద్ద సెంట్రీగా ఉన్న విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్వామి సర్వీస్ తుపాకీ తో కాల్చుకొని అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం నైట్ షిఫ్ట్ డ్యూటీ వచ్చిన స్వామి ఉదయం సరిగ్గా 5.30కి వాష్రూమ్ వెళ్లి అక్కడే పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ తో కాల్చుకున్నాడు.
అనంతరం గమనించిన తొటి సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించాలని అనుకున్నప్పటికి అప్పటికే ప్రాణలు కోల్పో్యాడు. ఇక స్పాట్కు వెళ్లిన సైఫాబాద్ పోలీసులకు ఓ సూసైడ్ నోట్ కూడా లభించింది.
అందులో మృతుడు స్వామి తన భార్య, పిల్లలను ఏమీ అనవద్దని రాసి ఉన్నట్లుగా గుర్తించారు. అదేవిధంగా కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఆత్మహత్యకు కారణం ఇద్దరని లేఖలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
