భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు నిజాంబాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఎన్నికతో కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల పై ఉన్న కపట ప్రేమ మరోసారి బయటపడింది, బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ నాయకుడిని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు ఓటమి ఖాయమని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ,అభ్యర్థిని నిలబెట్టింది ఈ విషయాన్ని బీసీలందరూ గమనించారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు బడుగు బలహీన వర్గాలను బీసీలను వ్యవహరిస్తుందని గాని వారి సంక్షేమానికి కృషి చేయదు బీసీల హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు
