పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తను భార్య, ఆమె కుటుంబ సభ్యులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది.
స్థానికుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన శ్రావణ్ కుమార్ కొంతకాలంగా గిర్రాజ్ కళాశాల సమీపంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయంపై అనుమానం పెంచుకున్న భార్య, తన కుటుంబ సభ్యులతో కలిసి నిఘా పెట్టింది. ఈ క్రమంలో గురువారం రాత్రి వారిద్దరూ కలిసి ఉండగా భార్య, బంధువులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆగ్రహానికి గురైన వారు శ్రావణ్ కుమార్తో పాటు సదరు మహిళకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
