బైకు ను కారు ఢీకొట్టిన ప్రమాదం లో ఒకరు మృతి చెందారు .నిజామాబాద్ జిల్లా సాలూర మండలం సాలూర క్యాంపు వద్ద బోధన్ -నాందేడ్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఎదురెదురుగా వస్తున్న ఓ కారు, 2 బైక్లు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ పరిశీలించారు.
