బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొతంగల్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఆకస్మికంగా తనిఖీ చేసారు
ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద గల సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ గల రికార్డు లను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అక్రమంగా పశువుల ను తరలించడం జరగకూడదని , ప్రతీ వాహనానికి గల కాగితాలు తనిఖీ నిర్వహించాలని తెలియజేశారు
అనంతరం వాహనాలను తనిఖీలు నిర్వహించారు. బోధన్ ఎ.సి.పి శ్రీనివాస్, రుద్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ , కోటగిరి పిఎస్ ఎస్ఐ సునీల్ లున్నారు
