Saturday, April 18, 2026
HomeLaw and Orderపోలీస్ శిక్షణార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలీ..పోలీస్ కమిషనర్ ఆదేశాలు

పోలీస్ శిక్షణార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలీ..పోలీస్ కమిషనర్ ఆదేశాలు

పోలీస్ శిక్షణ సెంటర్ ను పర్యవేక్షించిన చేసిన సీపీ రాబోయే పోలీస్ శిక్షణార్థులకు అనుకూలంగా ఉండే విధంగా అవసరమైన అన్ని సౌకర్యాలు , వసతులు అందుబాటులో ఉండాలని సిపి సాయి చైతన్య ఆదేశించారు.

సోమవారం ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీసు శిక్షణ కేంద్రమును ఆయన పర్యవేక్షించడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..పోలీస్ శిక్షణ సెంటర్ అనేది భవిష్యత్ పోలీస్ అధికారుల పాత్రను తీర్చిదిద్దే కేంద్రం. ఇక్కడ శిక్షణ పొందేవారికి శారీరక , మానసిక అభివృద్ధి జరిగేలా వాతావరణం ఉండాలనీ తెలిపారు.

తగిన వసతులు , శిక్షణా పరికరాలు , శిక్షకులు అందుబాటులో ఉండేలా చూడాలి” అని పేర్కొన్నారు. సెంటర్‌లో వసతులు , ట్రైనింగ్ సెంటర్ గదులు , వంటశాల , నీటి సరఫరా , శౌచాలయాలు , ఇండోర్ తరగతి గదులు , అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ తదితర అంశాలను పరిశీలించిన ఆయన , తక్షణమే కొంతమేర మెరుగుదలలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా బోధన్ ఏసిపి శ్రీనివాస్ , బోధన్ రూరల్ సి.ఐ విజయ్ బాబు , ఎడపల్లి ఎస్సై ఎమ్. రమ, ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!