విధి నిర్వహణ లో టార్గెట్ లఒత్తిడిని తట్టుకోలేక ఓ పోస్టు మెన్ ఆత్మ హత్యకుసిద్ధ పడ్డాడు .నగరంలోని తపాలా శాఖలో ఘటన కలకలం రేపుతోంది.
ఆలూర్కు చెందిన గంగాధర్ అనే పోస్ట్మన్ తనపై పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ అకౌంట్స్ లక్ష్యాలు పూర్తిచేయాలని అధికారం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించాడు.
ఈ పరిస్థితిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని, ఈ నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం, ఆలూర్లోని తన పొలంలో పురుగుల మందు తాగిన గంగాధర్ను స్థానికులు గమనించి వెంటనే ఆర్మూరులోని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
