నిజామాబాద్ నగరంలో జరిగిన పలు దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “హిందూ ఆలయాలను సంరక్షించుకోవడం మనందరి బాధ్యతని అన్నారు.. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని,దేవాలయాల సందర్శన ద్వారా పిల్లలకు మన సాంస్కృతిక విలువలను తెలియజేయాలని సూచించారు.
ఆలయాల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు.పాల్గొన్న ఆలయాలు:1. శ్రీ రామ శ్రీ దాస ఆంజనేయ స్వామి దేవాలయం- న్యాల్కల్ రోడ్2. శ్రీ భక్త గణేష్ ఆంజనేయ స్వామి దేవాలయం – సీతారాంనగర్ కాలనీ3. శ్రీ మహా మైసమ్మ దేవాలయం – నాందేవాడ4. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం (గణపతి, నవగ్రహ, నాగదేవతలతో) – సారంగాపూర్
