HomePOLITICAL NEWSUncategorizedఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి..ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ..పాల్గొన్న మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు...

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి..ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ..పాల్గొన్న మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి

భారతదేశాన్ని ఆధునిక దేశంగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేసిన మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి.

ఇందులో భాగంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. నగర మేయర్ ఉమారాణి రమేష్, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించి రోగులకు పండ్లను అందజేసి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అంతకుముందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మేయర్ ఉమారాణి రమేష్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి యువశక్తిని సద్వినియోగం చేస్తూ ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు.

సమాచార, సాంకేతిక (ఐటీ) రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దూరదృష్టి గల నాయకుడని శ్లాఘించారు. గ్రామీణాభివృద్ధి, విద్య, యువత సాధికారత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

ప్రజల సంక్షేమమే అసలైన రాజకీయమని నమ్మిన రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి వర్గానికి సేవ చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు.

మానవత్వం, సేవాభావం, ప్రజల పట్ల అంకితభావమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, ప్రజల కష్టసుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments