మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే బోధన్ కు చెందిన ఓ మహిళ శుక్రవారం రాత్రి షాపింగ్ కొరకు నిజామాబాద్ కు వచ్చింది.
షాపింగ్ అనంతరం తిరిగి ఇంటికి వెళ్లేందుకు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.బస్టాండ్ వద్ద వ్యక్తి ఆటో లో వచ్చి ఎక్కించుకొని డిచ్ పల్లి వైపు తీసుకెళ్ళి ఆ యువకుడితో పాటు మరో నలుగురు కలిసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దీంతో బాధితురాలు నగరంలోని ఒకటవ టౌన్ లో ఫిర్యాధు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
