HomeTelanganaNizamabadఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం --ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం –ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..

  • బకాయిలు రాబట్టేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలి..
  • కార్పొరేటర్ల కు ఉద్యోగులు విలువ ఇవ్వడం లేదు..
  • నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..

ఇందూరు: నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం లా కనపడుతుందని, దీనిపై కచ్చితంగా పూర్తి వివరణ ఇవ్వాల్సిందేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. నగర పాలక సంస్థ బడ్జెట్ ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్ అన్నారు.

రెవెన్యూ పెంచుకొనే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రతి పార్టీ కార్పొరేటర్ ఇందుకు సహకరిస్తామన్నారు. ఇప్పటికే ఇంకా 100 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా పన్నుల్లో చాలా తేడా ఉందని వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశానికి ముందు, ఒక అవగాహన సమావేశం నిర్వహిస్తే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • ప్రధానంగా నగరపాలక సంస్థ ఉద్యోగులకు సిబ్బందికి కార్పొరేటర్లు అంటే విలువ లేకుండా పోయిందన్నారు. ఏదైనా సమస్యలపై దరఖాస్తులపై సంప్రదిస్తే స్పందించడం లేదని తెలిపారు. చిన్న జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో సుందరీకరణ జరుగుతుందని, కానీ నిజామాబాద్ లో మాత్రం జరగడం లేదన్నారు. ప్రధానంగా బడ్జెట్, ఖర్చుల్లో తేడా ఉందని వాటిని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
  • మొత్తం 30 కోట్లు అంటే ప్రతి డివిజన్ కు రూ.50 లక్షల నిధులు ఉంటాయన్నారు, కానీ అవి ఖర్చు కావడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయలు ఉమారాణి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, ఫ్లోర్ సెక్రటరీ మఠం పవన్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments