ఓ హత్య కేసులో నిందితుల మీద అభియోగాలు రుజువు కావడంతో జీవిత కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ,స్ట్ కోర్టు స్పెషల్ జడ్జి T.శ్రీనివాస్ మంగళవారం తీర్పునిచ్చారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జేకే తండాకు చెందిన అరుణ అ ముదెల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల అంజయ్య కు వివాహేతర సంబంధం ఉందని, అతడి భార్య కాశమణి కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిపింది.
అయినప్పటికీ అరుణ, అంజయ్య వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఈ వివాహేతర సంబంధం వల్ల భర్త తనకు దూరంఅవుతున్నడని ఆందోళన చెందిన కాశమణి అరుణను హత్య చేయడానికి పథకం వేసింది.
గ్రామానికి చెందిన సుతారి చిన్న బాలయ్య సాయంతో, 2019 ఆగస్టు 29న అరుణ ను హత్య చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేయగా, న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ఇద్దరికి జీవితకారాగార శిక్ష విధిస్తూ తీర్పుని వెలువర్చారు.
