తయారు చేసిన గణపతి విగ్రహాలను అమ్మకాల కోసం తరలిస్తుండగా హై టెన్షన్ విద్యుత్త్ వైర్లు తగిలి ఇద్దరు మృత్యు వాత పడగ మరో ఏడుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు
ఈ ఘటన కోరుట్ల పట్టణం ఆదివారం సాయంత్రం జరిగింది వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని అమ్మకాలకోసం పక్క షెడ్ లోకి తీసుకెళ్తుండగా ఫై ఉన్న హై టెన్సన్ వైర్లు విగ్రహానికి తగిలాయి.విగ్రహం నాలుగు వైపులా ఇనుప తీగ వుండడం వల్ల విద్యుత్ షాక్ తగిలింది.
ఇద్దరు కూలీలు అక్కడే మృతి చెందారు . ఏడుగురికి తీవ్ర గాయాలు. అందులో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమం. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎం జి ఎంకు తరలించారు
