నిజామాబాద్ టిఎస్ఆర్ టిసి బస్టాండ్ లో సీబీసీ మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గురువారం టిఎస్ఆర్ టిసి బస్టాండ్ లో “స్వచ్ఛత హి సేవా” శ్రమదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఆనంద్ మాట్లాడుతూ..స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని టిఎస్ఆర్టిసి బస్టాండ్ లో సీబీసీ మరియు ఎన్ వైకె ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. ‘స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత’ నినాదంతో ఈ ఏడాది “స్వచ్ఛత హి సేవా” లో భాగంగా పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవలన్నారు. స్వచ్ఛతను ఓ జీవన విధానంగా మార్చుకోవలన్నారు.
స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని స్వచ్ఛత పట్ల అవగాహన కలిగి ఉండలన్నారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లల్, బస్ స్టేషన్ మేనేజర్ శివ రాజమ్మ, సిబిసి ఎఫ్ పీఏ రషిద్, టిఎస్ ఆర్ టిసి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
