హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని వివాదాస్పద 400 ఎకరాల భూములను సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ గురువారం హైదారాబాద్ కు చేరుకుంది.
చైర్మన్ సిద్ధాంత దాస్, ఆధ్వర్యంలో మరో ముగ్గురు సభ్యుల సాధికారిత కమిటీ కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల అధ్యయనంచేయనున్నది.హెచ్ సి యూ భూమలు వ్యవహారం ను సుమోటో కేసు గా తీసుకున్న అత్యున్నత న్యాయ స్థానం ప్రభుత్వ తీరును తీవ్రంగా స్థాయిలో ఆక్షేపించింది.
అక్కడి భూములు చదును చేసే పనులను నిలిపి వేసింది.తొలగించిన చెట్లు ,ప్రస్తుతం ఇంకా మిగిలి ఉన్న చెట్ల ను కమిటీ పరిశీలన , చేయబోతుంది జీవ వైవిధ్యం, పక్షులు, నెమలు జంతువులు వివరాలు అడిగి, స్వయంగా అధ్యయనం చేయనున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, యూనివర్సిటీ అధికారులతో సమావేశం కానున్నది.
