HomeCRIMEమహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై దాడి హేయమైన చర్య.

మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై దాడి హేయమైన చర్య.

మహబూబాబాద్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌పై దాడి ఘటనకు వ్యతిరేకంగా నిజామాబాద్ మెడికల్ కాలేజీ, జీజీహెచ్ అధ్యాపకులు వైద్య విద్యార్థులు నిరసన తెలిపారు.

దీంతో జీజీహెచ్ వద్ద అధ్యాపకులు, వైద్య విద్యార్థులు నల్ల రిబ్బన్లు ధరించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఒక అపస్మారక స్థితిలో 60% కన్నా తక్కువ ఆక్సిజన్ శాతం తో వచ్చిన రోగి మరణానంతరం ఆ రోగి అటెండెంట్స్ , వైద్యులపై మెడికల్ సూపరింటెండెంట్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

డాక్టర్లకు సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులు గౌరవప్రదంగా పనిచేయడానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments