ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీ కొన్న ఘటన నగరంలోనీ గంగస్థాన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు..
నిజామాబాద్ నుంచి నంది వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును గంగస్థాన్ ఫేస్ 2 నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొనడంతో కారు ముందు భాగం పూర్తి గా దెబ్బతింది. అయితే కారు బీభత్సం తో బస్సులోవున్న ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పిల్చుకున్నారు.
