HomeTelanganaNizamabadఅధికార ప్రతినిధి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారు..మేయర్ పీఠం కోసమే ఓట్ల గందరగోళం..అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ..

అధికార ప్రతినిధి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారు..మేయర్ పీఠం కోసమే ఓట్ల గందరగోళం..అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ..

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందనే భయంతోనే పాలక పక్షం ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దిలీప్ కుమార్‌తో భేటీ అయ్యారు.

ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, పొరపాట్లపై చర్చించి, అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక వార్డులోని ఓటర్లను కావాలనే మరో వార్డులోకి మార్చారని, అర్హులైన వేలాది మంది ఓట్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.

స్థానిక అధికార ప్రతినిధి కనుసన్నల్లోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ ముసాయిదాను ‘తప్పుల తడక’గా తయారు చేయించారని విమర్శించారు. “మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుండటంతో, ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోంది.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా అధికారులు పాలక పక్షానికి తొత్తులుగా మారడం సరికాదు” అని ఎమ్మెల్యే మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ జరిపి, తప్పులను సరిదిద్దాలి. వార్డుల వారీగా ఓటర్ల విభజన శాస్త్రీయంగా ఉండాలి.

ఓటర్ల జాబితాను సరిదిద్దకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments