ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ హత్య జరిగిందని ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించింది.
కేశవరావు భద్రతలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు పోలీసులకు లొంగిపోయి ఆయన సమాచారాన్ని అందించారని ఆరోపించారు.
కేశవరావుతో పాటు ఉన్న 35 మంది మావోయిస్టులు 60 గంటల పాటు పోరాడారని, చివరకు కేశవరావును పట్టుకొని కాల్చిచంపారని తెలిపారు.
బసవరాజ్ స్మృతిలో ప్రపంచ వ్యాప్తంగా సంస్మరణ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ప్రకటన పూర్తిపాఠం కింద చదవచ్చు.
