నడుచుకుంటు వెళ్తున్న యువతి చేతులో నుంచి ఓ యువకుడు సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన ఉదంతం నగరంలోని వినాయక్ నగర్ లో జరిగింది.
ప్రైవేట్ నర్సింగ్ హోం లో పనిచేస్తున్న యువతి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వెళ్తుండగా గుర్తు తెలియని యువకుడు బైక్ మీద వెనుక నుంచి వచ్చి యువతి చేతులో నుంచి ఫోన్ తీసుకోని రెప్పపాటు కాలం లో మాయం అయ్యాడు.
ఇంటలిజెన్సీ డిఎస్పీ ఇంటి ముందే ఈ ఘటన జరిగింది. ఆయనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాల్గోటౌన్ పోలీసులు హుటాహుటిన వచ్చారు.
