నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని, శ్రీనగర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు 7 ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు . ఒక ఇంట్లో నుండి నాలుగు తులాల బంగారం తో పాటు, 20వేల నగదు రూపాయలను బీరువా నుండి దొంగిలించారు .
సంఘటన స్థలానికి క్లూ టీం తో బోధన్ ఏసిపి చేరుకొని పరిశీలించారు . గ్రామాలలోని ప్రజలు గస్తీ దళాలు ఏర్పాటు చేసుకొని దొంగతనాలు జరగకుండా చూడవలసిన బాధ్యత గ్రామస్తులపై ఉందని ఎస్ఐ వివరించారు.
గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే 100కు డయల్ చేసి సమాచారాన్ని తెలపాలని ఎస్సై తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తులను త్వరలో పట్టుకోనున్నట్లు ఎస్సై తెలిపారు.
