మొరం టిప్పర్, ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి 44వజాతీయ రహదారి మీద చోటుచేసుకుంది.
గ్రామంలోని చత్రపతి శివాజీ స్టాచ్యూ నుంచి కామారెడ్డి వైపు రాంగ్ రూట్లో వస్తున్న మొరం టిప్పర్ భిక్కనూర్ వైపు వస్తున్న స్కూటీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఖమ్మంకు చెందిన మామ, కోడలు స్పాట్లోనే డెడ్ అవ్వగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను జిఎంఆర్ అంబులెన్స్లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
దాంట్లో ఒక బాలుడు మార్గ మధ్యలో మృతిచెందగా, మరొక బాలుని పరిస్థితి విషమంగా ఉంది
