రైలు కింద పడి ట్రాన్సెజెండర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నగరంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని గత మూడు నెలలుగా ఉంటున్న ట్రాన్స్ జెండర్ మీరా(45).
గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగ్గా లేక బుదవారం అర్సపల్లి పరిధిలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. దీంతో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
