హైదరాబాద్లో జూన్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన అమాటేర్ కబడ్డీ ఫెడరేషన్ అఫ్ ఇండియా (AKFI) జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యాయామ ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించారు.
అనురాధ పీడీ , జ్యోతి పీడీ , సాయిలు పి ఈ టీ ఈ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతలుగా అర్హత పొందారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంద్యాల లింగయ్య , కే . గంగాధర్ రెడ్డి మరియు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వారిని అభినందించారు.
కబడ్డీ క్రీడ అభివృద్ధికి వీరు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.జిల్లా నుంచి జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతలుగా అర్హత సాధించడం పట్ల క్రీడాభిమానులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
