కంటేశ్వర్ లోని నీలకంటేశ్వర ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవస్థానం పరిసరాల్లో ఆయన పర్యటించి ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు, వేధోచరణల మధ్య టీపీసీసీ చీఫ్కి ఆలయ అర్చకులు, దేవాధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో సత్కారం అందించారు.
