నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్టు విరిగిపడి కారు ధ్వంసమైంది. ఈ ఘటన వినాయక నగర్లోని అమరవీరుల స్థూపం వద్ద జరిగింది. సోమవారం రాత్రి ఒక్కసారిగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో భారీ వృక్షం నెలకొరిగింది.
అయితే, అక్కడే పార్కింగ్ చేసిన కారుపై పడడంతో కారు ధంసమైంది. ఘటన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం విరిగిన వృక్షాన్ని తొలగించారు.
