గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నగరంలోని పూసల గల్లి లోని లలిత రెసిడెన్స్ ముందు సుమారు 45-50 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉన్నట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు ఒకటవ టౌన్ సీఐ 8712659837 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
