21వ డివిజన్ లోని బాబా గ్రౌండ్ ప్రాంతంలో సీసీ రోడ్డు పనులను 21 వ డివిజన్ కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్ గారు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ పంచ రెడ్డి లలిత చరణ్ గారు మాట్లాడుతూ 21వ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తామని, డివిజన్ లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు డివిజన్ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో డివిజన్ అభివృద్ధికి పాటుపడతామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అజ్మత్, ముస్తఫా, షోయాబ్, గడ్కోలు సతీష్, వాహబ్, దేవేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
