బైకు ను ఇసుక టిప్పర్ ను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ మహిళా మృతి చెందింది బోధన్ నుండి నిజామావైపు వైపు వెళ్తున్న దర్గా వద్ద అశోక్ సాగర్ చెరువు కట్ట సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. జానకంపేట గ్రామానికి చెందిన మహిళ కమల .
తన కొడుకుతో కలిసి నిజామాబాద్ వైపు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో కమల అక్కడికక్కడే మృతి చెందింది .సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
